Homeక్రైమ్జూబ్లీహిల్స్ పీఎస్‌లో హరీష్ రావు సిట్ విచారణ కొనసాగింపు..!

జూబ్లీహిల్స్ పీఎస్‌లో హరీష్ రావు సిట్ విచారణ కొనసాగింపు..!

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగుతోంది. సజ్జనార్ నేతృత్వంలో సిట్ అధికారుల బృందం ప్రశ్నోత్తరాల ప్రక్రియ చేపట్టింది. ట్యాపింగ్ కేసు నేపథ్యంలో ఈ విచారణకు ప్రాధాన్యం సంతరించుకుంది.

విచారణ సందర్భంగా హరీష్ రావు తరఫు న్యాయవాది రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ట్యాపింగ్ కేసుతో హరీష్ రావుకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో హరీష్ రావుపై నమోదు చేసిన కేసు కూడా తప్పుడు కేసేనని కోర్టులు తేల్చిన విషయాన్ని గుర్తు చేశారు.

 

ప్రస్తుతం జరుగుతున్న సిట్ విచారణలోనూ కొత్తగా తేలే అంశాలు ఏమీ ఉండవని, ఇది పూర్తిగా రాజకీయ కోణంలో సాగుతున్న వ్యవహారమని న్యాయవాది అభిప్రాయపడ్డారు. చట్టపరంగా తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, విచారణను హరీష్ రావు సహకారంతో ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

 

అటు సిట్ అధికారులు మాత్రం విచారణపై ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు చేయకుండా, సాంకేతిక ఆధారాలు, పూర్వపు రికార్డులు, వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ విచారణలో తదుపరి దశలో ఎవరి పేర్లు బయటకు వస్తాయన్నది

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు