HomeజాతీయంViral Post: ఫ్లాట్‌లో రాత్రంతా అమ్మాయిలు.. బ్యాచిలర్లకు ఫైన్

Viral Post: ఫ్లాట్‌లో రాత్రంతా అమ్మాయిలు.. బ్యాచిలర్లకు ఫైన్

Viral Post: బెంగళూరుకు చెందిన ఓ యువకుడు రెడిట్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తాము ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు యువతులు రాత్రి అతిథులుగా ఉన్నారని .. సొసైటీ తమపై రూ.5 వేల జరిమానా వేసిందని అతడు ఆన్‌లైన్‌లో వెల్లడించాడు. తన ఫ్లాట్‌మెట్‌తో కలిసి ఉండే ఈ యువకుడు, సొసైటీ ఇచ్చిన బిల్లు స్క్రీన్‌షాట్‌ను కూడా పోస్ట్ చేసి, ఇలాంటి నియమాలు అమలు చేయడానికి హౌసింగ్ సొసైటీకి ఏమైనా అధికారాలు ఉన్నాయా అని ప్రశ్నించాడు.

ఈ అపార్ట్‌మెంట్‌లో అవివాహితులకే ప్రత్యేకంగా కొన్ని పరిమితులు పెట్టారని, అదే సమయంలో కుటుంబంతో ఉంటున్నవారికి ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నాడు. బ్యాచిలర్స్‌కు రాత్రివేళ అతిథులు ఉండకూడదని, ఫ్యామిలీ విషయంలో మాత్రం అలాంటిది లేదని అన్నాడు. అన్ని రకాల మెయింటెనెన్స్‌ చెల్లిస్తున్నప్పటికీ, విభిన్న నియమాలు ఎందుకు? అంటూ అసహనం వ్యక్తం చేశాడు.

నవంబర్ 1న జారీ చేసిన ఆ ఇన్వాయిస్‌లో అక్టోబర్ 31న జరిగిన ‘‘ఇన్ఫ్రాక్షన్’’ పేరుతో జరిమానా వేశారు. ‘‘ఇద్దరు యువతులు రాత్రంతా ఉన్నారు’’ అనే కారణాన్ని బిల్లు వివరాల్లో సొసైటీ స్పష్టంగా నమోదు చేసింది. దీనిపై రెడిట్‌లో చాలామంది స్పందిస్తూ, ఒకే కమ్యూనిటీలో కుటుంబాలు, బ్యాచిలర్స్‌కు వేర్వేరు నియమాలు పెట్టడం ఎంతవరకు సరైంది? ఇలాంటి వివక్షాత్మక నియమాలకు చట్టపరమైన విలువ ఉందా? అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

ALSO READ: Love Marriage: అత్తను పెళ్లి చేసుకున్న యువకుడు!

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు