Homeజాతీయంరాజకీయ కక్షతోనే మీనాక్షి నటరాజన్‌ నామినేషన్ తిరస్కరణ.. మహేశ్ కుమార్ గౌడ్

రాజకీయ కక్షతోనే మీనాక్షి నటరాజన్‌ నామినేషన్ తిరస్కరణ.. మహేశ్ కుమార్ గౌడ్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో దేశంలో సామాన్యుడికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ నిత్యవసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తారు. గృహిణులను ఇబ్బంది పెట్టేలా ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈరోజు (గురువారం) ఢిల్లీ వేదికగా మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా జాతీయస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఏఐసీసీ సమావేశంలో చర్చించామని మహేశ్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో ఎక్కడా మీనాక్షి నటరాజన్‌పై కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు. రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగా మహిళా అని కూడా చూడకుండా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారని ఆగ్రహించారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.. దేశ చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదని చెప్పుకొచ్చారు. బీజేపీ వినాశకర రాజకీయాలు చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు