HomeతెలంగాణTGSRTC: ఉద్యోగులకు ఊరట...!

TGSRTC: ఉద్యోగులకు ఊరట…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: TGSRTC ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెండింగ్‌లో ఉన్న 2.1% కరవు భత్యం (DA) పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2.1% డీఏను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన డీఏ జూన్ 2022 నుండి అమలులోకి రానుంది.

ఈ నిర్ణయం ద్వారా సంస్థలోని సుమారు 50,000 మందికి పైగా ఉద్యోగులు మరియు కార్మికులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. ఈ 2.1% పెంపునకు సంబంధించిన బకాయిలను (Arrears) కూడా ప్రభుత్వం చెల్లించనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇది ఒకటి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు