మేడ్చల్, క్రైమ్మిర్రర్: అల్వాల్ లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. మచ్చ బొల్లారంలోని ఓ ఇంట్లో చోరికి పాల్పడ్డారు. బాధితుడు రమేష్ అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్లాడు. దాంతో దొంగలు పక్కా స్కెచ్ తో దోపిడికి పాల్పడ్డు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనలో 30 తులాల బంగారం, వెండి ఆభరణాలు, లక్ష రూపాయల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు.
ఇంటిగేటు, ఇంటి తాళాలు పగలగొట్టిన విషయాన్ని గమనించి స్థానికులు రమేష్ కు సమాచారం అందించారు. దాంతో రమేష్ టాహుటిన అరుణాచల్ ప్రదేశ్ నుంచి తిరిగి వస్తున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.