ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: అమెరికాలో యాన్యువల్ ప్రెస్ డిన్నర్ చేస్తున్న సందర్భంలో ఆకస్మత్తుగా కాల్పులకు పాల్పడగా తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ దాడిని ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘వాషింగ్టన్ డీసీలోని ఓ హోటల్లో ఇటీవల జరిగిన భద్రతా పరమైన ప్రమాదం నుంచి అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ, ఉపాధ్యక్షుడు సురక్షితంగా బయటపడ్డారని తెలుసుకుని ఊరట చెందాను. వారు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను.ఈ దాడిని ఖచ్చితంగా ఖండించాల్సిందే’ అని రాసుకొచ్చారు.