నీట్ (NEET) పరీక్షలలో పేపర్ లీకేజీ ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో, నటి మానుషి చిల్లర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను కూడా ఒకప్పుడు ఈ సమస్యను ఎదుర్కొన్న విద్యార్థినినేనని ఆమె తెలిపారు.
ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ, 2015లో జరిగిన పేపర్ లీకేజీ కారణంగా తాను మళ్లీ పరీక్ష రాయాల్సి వచ్చిందని చెప్పారు. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న ఒత్తిడి, నిరాశ ఇప్పటికీ గుర్తున్నాయని వెల్లడించారు.
నీట్ పరీక్ష కోసం సిద్ధమవుతున్న రోజుల్లో, తనకు ఎంతో ఇష్టమైన కూచిపూడి నృత్యం, పెయింటింగ్ వంటి హాబీలను కూడా కొంతకాలం పక్కన పెట్టాల్సి వచ్చిందని మానుషి చెప్పారు. కష్టపడి చదివి పరీక్ష రాసినా, పేపర్ లీక్ అవ్వడంతో మళ్లీ పరీక్ష రాయాల్సి రావడం చాలా కఠినమైన అనుభవమని వివరించారు.
ఈ తరహా ఘటనలు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. పరీక్షలపై నమ్మకం దెబ్బతినడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. విద్యార్థుల కృషికి న్యాయం జరిగేలా వ్యవస్థ బలపడాలని కోరుకున్నారు.
also read: కైవ్పై రష్యా భారీ వైమానిక దాడి.. తొమ్మిది మంది మృతి
