HomeUncategorizedవాహ‌న‌దారులచే హెల్మెట్‌ధార‌ణ ప్ర‌మాణం

వాహ‌న‌దారులచే హెల్మెట్‌ధార‌ణ ప్ర‌మాణం

రోడ్డు భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న‌

ఒంగోలు, క్రైమ్‌ మిర్ర‌ర్ః

ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌కు పోలీసులు వినూత్నంగా రోడ్డు భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. టంగుటూరు టోల్ ప్లాజా వ‌ద్ద పోలీసులు వాహ‌న త‌న‌ఖీలు నిర్వ‌హించారు.

కొంద‌రు వాహ‌న‌దారులు హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచ‌క్ర‌వాహ‌న‌దారుల‌ను ఆపి వారికి రోడ్డుభ‌ద్ర‌త నియ‌మాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు.

హెల్మెట్ ప్రాణ రక్షక కవచంలా పనిచేస్తుందని పోలీసులు వివరించారు. అనంతరం వాహనదారులందరిచే “నేటి నుండి ప్రయాణంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తాం” అని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో సింగరాయకొండ సీఐ మాట్లాడుతూ కుటుంబ సభ్యుల క్షేమం కోసమైనా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు