HomeతెలంగాణGood News: ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కొక్కరికి ₹1.02 కోట్ల రూపాయాలు

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కొక్కరికి ₹1.02 కోట్ల రూపాయాలు

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరటనిస్తూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 5.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రయోజనం చేకూరనుంది.
ప్రతి ఉద్యోగికి ₹1.02 కోట్ల ప్రమాద బీమా (Accidental Insurance) వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన ఖాతాలు ఉన్న బ్యాంకుల ద్వారా ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ బీమా సౌకర్యానికి ఉద్యోగులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు (Zero Premium). బ్యాంకులు తమ కార్పొరేట్ శాలరీ ప్యాకేజీలో భాగంగా దీనిని అందిస్తున్నాయి. ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించినా ఈ బీమా వర్తిస్తుంది.
Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు