సినీ నటి, గాయని శృతి హాసన్ జీవితంలో మరో ప్రత్యేక ఘట్టం చోటుచేసుకుంది. తన కెరీర్లో వరుస అవకాశాలతో ముందుకు సాగుతున్న ఆమె తాజాగా చెన్నైలో కొత్త ఇంటిని సొంతం చేసుకున్నారు. ఎంతో ఇష్టంతో కొనుగోలు చేసిన ఈ ఇంటికి సంప్రదాయ పద్ధతుల్లో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా శృతి హాసన్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన శృతి.. పూజా కార్యక్రమాల్లో ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొనడం అభిమానులను ఆకట్టుకుంది. తన సొంత కష్టంతో కొత్త ఇంటిని కొనుగోలు చేయడం పట్ల అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే ఈ గృహప్రవేశ వేడుకకు సంబంధించిన ఫొటోలు మరోవైపు సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యాయి. గతంలో కొన్ని సందర్భాల్లో తాను మతపరమైన విషయాలపై భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నట్లు శృతి హాసన్ చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నలు చేస్తున్నారు. మరోవైపు వ్యక్తిగత నమ్మకాలు, ఆలోచనలు కాలానుగుణంగా మారడం సహజమేనని పలువురు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. సంప్రదాయాలను గౌరవించడం, వ్యక్తిగత విశ్వాసాలను పాటించడం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని కామెంట్లు చేస్తున్నారు.
also read: అర నిమిషంలో 195 కిస్సులు.. బ్రెజిల్ జంట గిన్నిస్ వరల్ఢ్ రికార్డ్!
ఇదిలా ఉంటే ఈ వేడుకలో శృతి తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక, సోదరి అక్షర హాసన్ కనిపించకపోవడం కూడా చర్చకు దారితీసింది. కుటుంబ సభ్యులు హాజరు కాకపోవడానికి కారణాలపై ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. అయితే సినీ ప్రముఖుల బిజీ షెడ్యూల్స్ కారణంగా కొన్ని కార్యక్రమాలకు హాజరు కావడం కుదరకపోవచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇక శృతి హాసన్ ప్రస్తుతం నటిగా, గాయనిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కొనసాగిస్తున్నారు. మరోవైపు కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ నటనతో పాటు సినిమా నిర్మాణం, రచన, ఇతర సాంకేతిక విభాగాలపై కూడా దృష్టి పెడుతున్నట్లు సమాచారం.
శృతి హాసన్ కొత్త ఇంటి గృహప్రవేశ వేడుక ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
also read: Ketan Agarwal Death Case: ప్రధాని మోదీకి తల్లి లేఖ.. కుమారుడికి న్యాయం చేయాలని వేడుకోలు