ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా రామకుప్పానికి చెందిన 26 ఏళ్ల మనోజ్ఞ కర్ణాటకలోని ముళబాగిలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మనోజ్ఞకు సుమారు ఆరేళ్ల క్రితం సుబ్రహ్మణ్యంతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో తమ స్థోమత మేరకు బంగారం, నగదు కట్నంగా ఇచ్చామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే వివాహం తర్వాత అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తింటివారు మనోజ్ఞను వేధించేవారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో మంగళవారం మనోజ్ఞ ఉరేసుకుని మృతి చెందినట్లు అత్తింటివారి నుంచి సమాచారం అందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదని, అత్తింటివారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కుమార్తె మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మనోజ్ఞ కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి అసలు కారణం ఏమిటన్న దానిపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
also read: పవన్ కల్యాణ్ బర్త్డే వేడుకల్లో విషాదం.. ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ యువకుడు మృతి
