- గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలి
- సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్
క్రైమ్ మిర్రర్, మునుగోడు : మండల కేంద్రంలోని శ్రీ శివరామాలయంలో శనివారం శని త్రయోదశి పూజలు నిర్వహించారు. మాస శివరాత్రి సందర్భంగా పార్వతి పరమేశ్వరుల మాస కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు..సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ దంపతులు,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు..అర్చకులు కొండోజు నవీన్ కుమార్ శిష్య బృందం కళ్యాణ తంతు నిర్వహించారు..పరమశివుని ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సర్పంచ్ రమాదేవి నరసింహ గౌడ్ కోరారు.సోమవారం అమావాస్య సందర్భంగా ఉదయం 5 గంటలకు అన్నాబిషేకం నిర్వహించడం జరుగుతుందని అర్చకులు నవీన్ కుమార్ తెలిపారు..గ్రామస్తులు,అర్చకులు పాల్గొన్నారు.