-
కేంద్ర పెద్దల వ్యూహం
-
కేంద్ర మంత్రి హెచ్ డి కుమారస్వామి ద్వారా ప్రయత్నం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. నలుగురు సభ్యులు రాష్ట్రం నుంచి పదవీ విరమణ చేయడంతో వారి స్థానంలో కొత్త వారి ఎన్నిక జరగనుంది. ఈనెల 18న ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులను ఎన్నుకోనున్నారు. అయితే కూటమికి ఏకపక్ష బలం ఉండడంతో నాలుగు పదవులు దక్కనున్నాయి. అయితే ఈసారి బిజెపికి చాన్స్ లేదని ప్రచారం నడుస్తోంది.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రాజ్యసభ పదవులను బిజెపికి ఇచ్చింది టిడిపి. జనసేనకు ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు. అందుకే ఒక పదవి జనసేనకు ఇచ్చి.. మిగతా మూడు పదవులు టిడిపి తీసుకోవాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర బిజెపికి తెలియజేశారు చంద్రబాబు.
బిజెపి కి నో ఛాన్స్..
దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల నుంచి 24 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. అయితే ఇందులో నేరుగా 11 మంది రాజ్యసభ సభ్యులను బిజెపి దక్కించుకోనుంది. ఓ ఆరు చోట్ల మాత్రం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు బలంగా ఉన్నాయి.
అందులో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు రానున్నాయి. అయితే ఈసారి బిజెపికి చాన్స్ ఇవ్వకూడదు అని చంద్రబాబు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ బిజెపి ఆలోచన వేరే విధంగా ఉంది. ఏపీ నుంచి ఎలాగైనా ఒక్క సీటు పొందాలన్న ఆలోచనలు సరికొత్తగా ఒక ప్రణాళిక రూపొందించింది.
కర్ణాటక నుంచి కాకుండా ఏపీ నుంచి…
కర్ణాటకలో జెడిఎస్ కీలక భాగస్వామి. మాజీ ప్రధాని దేవే గౌడ కర్ణాటక నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది జెడిఎస్. దేవే గౌడ కుమారుడు కుమారస్వామి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. పొత్తులో భాగంగా కర్ణాటక నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ పదవి తన తండ్రికి ఇవ్వాలని కుమారస్వామి బలంగా కోరుతున్నారు.
అయితే అక్కడ బిజెపి నేత సదానంద గౌడ కు పదవి ఇచ్చేందుకు హైకమాండ్ నిర్ణయించింది. అందుకే ఏపీ నుంచి దేవే గౌడకు అవకాశం ఇవ్వాలని కోరుతోంది. చంద్రబాబుకు దేవే గౌడతోపాటు కుమారస్వామి అత్యంత సన్నిహితులు. అందుకే వారి ద్వారా ప్రయత్నాలు చేస్తోంది. వారితో సాన్నిహిత్యం ఉండడం, కేంద్ర పెద్దలు కోరుతుండడంతో.. ఏపీ నుంచి తప్పకుండా దేవి గౌడ కు రాజ్యసభ పదవి వచ్చే అవకాశం ఉంది.