Homeఆంధ్ర ప్రదేశ్మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో మంత్రి లోకేష్ భేటీ...! ప‌లు అంశాల‌పై చ‌ర్చా...

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో మంత్రి లోకేష్ భేటీ…! ప‌లు అంశాల‌పై చ‌ర్చా…

అమ‌రావ‌తి, క్రైమ్ మిర్ర‌ర్‌: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబైలో సోమవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. సాదర స్వాగతం పలికిన సీఎంను మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించి, శ్రీవారి ప్రతిమను లోకేష్ అందజేశారు. ఈ సందర్భంగా గణేష్ ప్రతిమను సీఎం బహుకరించారు.

ఏపీకి వచ్చిన పెట్టుబడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మంత్రి లోకేష్ మహారాష్ట్ర సీఎంకి వివరించారు. ఏపీ విద్యా శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, స్కిల్ డెవలప్మెంట్ విధానాలు తెలియజేశారు. మహారాష్ట్ర ఐటీ, విద్యా శాఖలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలు సీఎంను అడిగి లోకేష్ తెలుసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు