క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వేసవికాలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాలలో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి అని షాప్ యాజమాన్యాలు చెబుతున్నాయి. గత ఆదివారం నాడును హైదరాబాదులో స్కిన్లెస్ కేజీ చికెన్ ధర 260 నుంచి 280 పలకగా నేడు ఏకంగా 340 రూపాయలకు పెరిగిపోయింది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోని 80 రూపాయలకు పైగా పెరగడంతో చికెన్ కొనుగోలు చేసేటువంటి వినియోగదారులు షాక్ లో ఉండిపోయారు. అప్పుడప్పుడు చికెన్ తినాలనుకున్నటువంటి సామాన్య ప్రజలు సైతం ధరలు చూసి ఆశ్చర్యపోతున్నారు. వేసవికాలం అందులోనూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఫంక్షన్లు మరియు పెళ్లిళ్లు జరుగుతున్న కారణంగా ధరలు అమాంతంగా పెరిగాయని భావిస్తున్నారు. మరోవైపు అధికారులు సైతం ఎప్పటికప్పుడు నాన్ వెజ్ షాపులపై తనిఖీలు చేస్తూ ఉన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చికెన్ ధరలు హాట్ టాపిక్ గా మారిపోయాయి.
TamilNadu Politics: TVK చీఫ్ విజయ్ కీలక నిర్ణయం