Director Aditya Dhar: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న చిత్రం ధురంధర్ 2. బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా, విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల నుంచి అపారమైన ఆదరణను సొంతం చేసుకుంది. ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్లో చోటు సంపాదించిన ఈ సినిమా రోజురోజుకీ మరింత వేగంగా వసూళ్లను పెంచుకుంటూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. వివిధ భాషల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తుండడంతో దీని ప్రభావం అన్ని పరిశ్రమలపైనా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్ ప్రముఖ నటులు మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపించగా, ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చిత్రానికి మరింత క్రేజ్ తీసుకువచ్చింది.
సినిమాను ప్రశంసిస్తూ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు ఆదిత్య ధర్ను బాక్సాఫీస్ కా బాప్ అంటూ అభివర్ణించిన ఆయన.. ఈ సినిమాను ప్రతి భారతీయుడు తప్పనిసరిగా చూడాల్సిన చిత్రం అని పేర్కొన్నారు. బాలీవుడ్ చిత్రంపై ఇంతటి స్థాయిలో ప్రశంసలు అందించడం సినిమాకు మరింత హైప్ తీసుకువచ్చింది. ముఖ్యంగా రజినీకాంత్ వంటి అగ్రస్థాయి నటుడు ఈ చిత్రాన్ని కొనియాడడంతో ధురంధర్ 2 చిత్రబృందం ఆనందంలో మునిగిపోయింది. ఆయన అభినందనలు చిత్రానికి మరింత ప్రాచుర్యం కలిగిస్తున్నాయి.
రజినీకాంత్ చేసిన ట్వీట్కు స్పందించిన దర్శకుడు ఆదిత్య ధర్ భావోద్వేగానికి గురయ్యారు. చిన్ననాటి నుంచి రజినీకాంత్ను ఒక ప్రమాణంగా తీసుకుని పెరిగామని, వినోదానికి ఆయనే అసలైన నిర్వచనం అని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ ఇప్పటికీ అదే శైలి, ఆకర్షణతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న సూపర్ స్టార్ నుంచి ప్రశంసలు అందుకోవడం తన జీవితంలో అత్యంత గొప్ప క్షణమని తెలిపారు. తమలాంటి వారిని పెద్ద కలలు కనాలని ప్రోత్సహించిన వ్యక్తి నుంచి ఇలాంటి అభినందనలు రావడం నిజంగా ఒక వరంగా భావిస్తున్నానని భావోద్వేగంతో వెల్లడించారు. ప్రస్తుతం రజినీకాంత్, ఆదిత్య ధర్ ట్వీట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇక ధురంధర్ 2 సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో సారా అర్జున్ కథానాయికగా నటించగా, కథా నిర్మాణం, యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. గతంలో విడుదలైన ధురంధర్ మొదటి భాగానికి ఇది కొనసాగింపుగా రూపొందించబడింది. మొదటి భాగం సాధించిన విజయాన్ని మరింత విస్తరించేలా ఈ సీక్వెల్ను రూపొందించడంతో ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తూ విజయయాత్ర కొనసాగిస్తోంది.
ALSO READ: ఐపీఎల్ 2026 కొత్త రూల్స్.. స్టేడియంలో ఆటగాళ్లకు ఫుల్ రిస్ట్రిక్షన్
