Homeఆంధ్ర ప్రదేశ్ఒంటరి జంటలే ఆ ముఠాల టార్గెట్‌

ఒంటరి జంటలే ఆ ముఠాల టార్గెట్‌

  • వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్‌
  • పోలీసులు అదుపులో నిందితులు
  • వారి సెల్‌ఫోన్‌ల‌లో విస్తుపోయే వీడియోలు

విజయవాడ, క్రైం మిర్ర‌ర్ః

ఎన్టీఆర్ జిల్లా నందిగామ‌లో దారుణం చోటు చేసుకుంది.

ఏకాంతంగా ఉన్న ఒంట‌రి జంట‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని వీడియోలు తీస్తూ త‌రువాత వారిని బ్లాక్ మెయిల్‌కు చేస్తూ డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న‌ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొంత మంది యువ‌కులు గొడ‌వ‌పడుతున్న‌ట్లుగా పోలీసుల‌కు స‌మాచారం రావ‌డంతో అక్క‌డి వెళ్లి వారిని అదుపు లోకి తీసుకొని సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని చూడ‌గ పోలీసుల‌కు విస్తుపోయే వీడియోలు బ‌య‌ట‌ప‌డ్డాయి..

ఈ ముఠా అరాచ‌కాలు తెలుసుకున్న పోలీసులు షాక్ తిన్నారు. ఈజీగా మ‌ని సంపాదించాల‌నే దురుద్దేశంతో వీడియోలు తీస్తూ త‌రువాత వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ డ‌బ్బులు దండుకుంటున్న‌ట్లుగా తేలింది.

మ‌ద్యానికి బానిసైన యువ‌కులు ఈజీగా మ‌నిగా సంపాదించాల‌నే ఒంట‌రి జంట‌ల‌ను టార్గెట్ చేస్తూ వీడీయోలు తీస్తూ త‌రువాతవారికి చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

ఖాళీ ప్ర‌దేశాల్లో ఒంట‌రి జంట‌ల‌ను గ‌మ‌నించ‌డం ఆ త‌రువాత వీడియోలు తీయ‌డం అల‌వాటుగా మార్చుకున్నారు.

వీరి సెల్‌ఫోన్‌ల‌లో చాలా వీడియోలు ఉన్న‌ట్లు డ‌బ్బులు బాగానే డ‌బ్బులు వ‌సూలు చేసిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు.

 

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు