Homeక్రైమ్మాడుగులపల్లిలో దారుణం: భర్తను చంపినా భార్య..!

మాడుగులపల్లిలో దారుణం: భర్తను చంపినా భార్య..!

క్రైమ్ మిర్రర్, మాడుగులపల్లి ప్రతినిది: తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను అతికిరాతకంగా హతమార్చిన ఘటన మాడుగులపల్లి మండలం, సీత్యాతండా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది..

స్థానికులు తెలిపిన వరాల ప్రకారంగా…నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలము సీత్యతండ గ్రామానికి చెందినా రామవాత్ రవి,లక్ష్మి దంపతులు, రామవాత్ రవి వేములపల్లి మండలము సల్కునూరు గ్రామంలోని PACS కార్యాలయంలో విదులు నిర్వహిస్తూ ఉండేవాడు, భార్య లక్ష్మి ఇంటి వద్దే ఉండేది.

అయితే గత కొన్ని రోజులుగా భార్య లక్ష్మి వ్యవహార శైలిలో మార్పులు గమనించిన భర్త రవి ఆమెను మండలిన్చేవాడు, గత సంవసరం క్రితం లక్ష్మి తన ప్రియుడు తో కలిసి ఉండడం చూసి ఆమెను మందలించేవాదు అన్నారు. ఐన భార్య లక్ష్మి మారకపోవడంతో తరాసు వీరిద్దరి కాపురంలో వివాహేతర సంబంధం కారునంగా గొడవలు జరుగుతువుండేవి అన్నారు.

అయితే భార్య లక్ష్మి నా అక్రమ సంబందానికి భర్త రవి అడ్డువస్తున్నాడు అని ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో పన్నాగం పన్నింది. తన ప్లాన్ ప్రకారం భర్త రవిని బుదవారం అతి కిరతంకంగా చంపింది. అనంతరం పోలీస్ ల వద్దకు వెళ్లి నేరం ఒప్పుకొని లొంగిపోయింది అన్నారు.

గ్రామస్తులు వచ్చి చూసేసరికి మృతుడు రవి అతడి ముక్కులోంచి రక్తం కారి చనిపోయ్యి వున్నాడు, ఈ దంపతులకు ఇద్దరు కుమారులు వున్నారు. ఈ దారుణ ఘటనతో ఒక్కసారిగా తండాలో విశాదచాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనతో ఎలాంటి అవన్చనియ ఘటనలు జరగకుండా లక్ష్మి ప్రియుడుని పోలిసులు అదుపులోకి తిసుకునట్లు సమాచారం. ఈ ఘటన పై పోలిసుసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు