Saturday, March 14, 2026
Homeతెలంగాణబ్యాంకుల సమ్మె: వరుసగా 3 రోజులు బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం

బ్యాంకుల సమ్మె: వరుసగా 3 రోజులు బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: బ్యాంకింగ్ రంగంలో పని వేళలను పెంచుతూ అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించాలని 2024 మార్చిలో కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం ఇంకా అమలు చేయకపోవడంతో తక్షణమే అమలు చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది.

ఈ సందర్బంగా నేడు జనవరి 27, 2026 (మంగళవారం)న దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన ఒక రోజు సమ్మె కారణంగా తెలంగాణతో సహా దేశమంతటా బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్ మరియు రుణ మంజూరు వంటి సేవలు నిలిచిపోయాయి.

జనవరి 25 (ఆదివారం), జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) తర్వాత నేడు సమ్మె జరగడంతో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు. హైదరాబాద్, అదిలాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బ్యాంక్ సిబ్బంది నిరసనలు చేపట్టారు. ప్రైవేట్ బ్యాంకులైన HDFC, ICICI మరియు ఆక్సిస్ బ్యాంక్ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. అలాగే UPI, మొబైల్ బ్యాంకింగ్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments