Homeతెలంగాణప్రజలు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని దుర్వినియోగం చెయ్యను - భరత్

ప్రజలు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని దుర్వినియోగం చెయ్యను – భరత్

లక్ష్మీదేవిగూడెం ప్రజలకు కృతజ్ఞతలు

సర్పంచ్ ఎలికెట్టి భరత్

క్రైమ్ మిర్రర్,వేములపల్లి ప్రతినిది: నల్గొండ జిల్లా, వేములపల్లి మండలము, లక్ష్మీదేవిగూడెం గ్రామ అభివృద్ధికి బాటలు వేస్తూ, ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా అని నూతన సర్పంచ్ ఎలికెట్టి భరత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై తనపై విశ్వాసం ఉంచి గ్రామ సర్పంచ్ గా ఎన్నుకున్న లక్ష్మీదేవిగూడెం గ్రామ ప్రజలందరికీ సర్పంచ్ ఎలికట్టి భరత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ….. నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ల సహకారంతో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తానని తెలిపారు. నేను గ్రామపంచాయతీలో ప్రజలందరిని పార్టీ బేధం లేకుండా తన దగ్గరికి వచ్చిన ఏ సమస్య అయినా పార్టీలకతీతంగా పనిచేస్తానని తెలియజేశారు.
తనకు ఓటు వేసి సర్పంచ్ గా గెలిపించిన గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరుపేరునా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు అంతేగాక లక్ష్మీదేవిగూడెం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా గ్రామ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి శక్తి వంచన లేకుండా పాటుపడి గ్రామస్తుల రుణం తీర్చుకుంటానని తెలిపారు.
Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు