Homeక్రైమ్వేములపల్లి లో దారుణం... కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి

వేములపల్లి లో దారుణం… కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, వేములపల్లి: పెన్షన్ కోసం వెళుతూ కారు ప్రమాదానికి గురై ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన వేములపల్లి మండలం శెట్టిపాలెం క్రాస్ రోడ్ అద్దంకి నార్కట్పల్లి రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది.. కుటుంబ సభ్యులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంగా..

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బొమ్మకల్లు గ్రామానికి చెందిన అక్కనపల్లి బజరయ్య(67) అనే వ్యక్తి వేములపల్లి మండల కేంద్రంలో పెన్షన్ కోసం ఉదయం 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరారన్నారు.

ఈ క్రమంలో సుమారు ఒంటిగంట ప్రాంతంలో మండలం పరిధిలోని శెట్టిపాలెం క్రాస్ రోడ్ అద్దంకి నార్కట్పల్లి రహదారినీ దాటుతుండగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళుతున్న ఒక కారు అతివేగంగా వచ్చి అతనిని ఢీకొట్టడంతో బజరయ్య ఎగిరి రోడ్డు పక్కన పడిపోయారన్నారు.

ఈప్రమాదంలో తలకు,కళ్ళకు త్రివ్ర గాయాలయి రక్తస్రావం అవడంతో స్థానికులు గమనించి మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరీక్షించిన వైద్యులు అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు అన్నారు..

Also Read:బిగ్ బ్రేకింగ్ న్యూస్.. చేపల లోడుతో వెళ్తున్న లారీ బీభత్సం.. ఆరుగురు మృతి!

Also Read:చివరి ఓటు పడేవరకు అప్రమత్తంగా ఉండాలి-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు