Homeక్రైమ్గోన సంచిలో గుర్తు తెలియ‌ని మృతదేహం

గోన సంచిలో గుర్తు తెలియ‌ని మృతదేహం

  • జిల్లా కేంద్రంలో ఘ‌ట‌న‌
  • ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు

కామారెడ్డి,క్రైం మిర్ర‌ర్ః కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీఎస్ ఐ చ‌ర్చి స‌మీపంలో గోన సంచిలో గుర్తు తెలియ‌ని మృతి దేహం క‌ల‌క‌లం రేపుతోంది.

వివ‌రాల ప్ర‌కారం గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఒక వ్య‌క్తిని హ‌త్య చేసి ముక్క‌లుగా చేసి ప‌డేశారు. చెత్త ఏరుకునే వారు గోన‌సంచిలో మ‌నిషి కాళ్లు చూసి పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని చూడ‌గా గోన సంచిలో న‌డుము నుంచి కాళ్ల వ‌ర‌కు మాత్ర‌మే ఉన్న మృత‌దేహాన్నిగుర్తించారు

మిగితా మృత‌దేహం కోసం వెతికిన దోర‌క‌లేదు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకొని, మృతుడి వివ‌రాల కోసం ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు