Homeతెలంగాణకో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లు...!

కో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లు…!

  • చారిత్రాత్మక సంస్కరణకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం

  • పాలనలో వివక్షకు గురైన బాధిత వర్గం

  • తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లుకు శాసనసభలో ఆమోదముద్ర

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చారిత్రాత్మక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. సమాజంలో వివక్ష, నిర్లక్ష్యానికి గురవుతున్న ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీని పాలనా వ్యవస్థలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ స్థానిక సంస్థల పాలనలో సమానత్వం, సామాజిక సాధికారత దిశగా ఈ కీలక నిర్ణయాన్ని అమలు చేయనుంది. మునిసిపాలిటీల సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. తద్వారా స్థానిక పట్టణ పరిపాలన వ్యవహారాల్లో ట్రాన్స్ జెండర్ లకు నేరుగా ప్రాతినిధ్యం కల్పించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది.

  • ఒక్కో కార్పొరేషన్ లో ఒక్కో పదవి..

కాంగ్రెస్ ప్రభుత్వ తాజా నిర్ణయం.. నూతన చట్ట సవరణ ప్రకారం.. హైదరాబాద్ నగరానికి సంబంధించి కోర్ అర్బన్ రీజియన్ వెలుపల ఉన్న.. రాష్ట్రంలోని తొమ్మిది ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్ లలో ట్రాన్స్ జెండర్లకు అవకాశం కల్పిస్తారు.

ప్రతి కార్పొరేషన్ లో ఒక్కో ట్రాన్స్ జెండర్ ను కో ఆప్షన్ సభ్యుడిగా ప్రభుత్వం నామినేట్ చేయనుంది. దీనికి చట్టబద్ధమైన వీలు కల్పించేందుకే తెలంగాణ మున్సిపాలిటీల చట్టం – 2019 కి అవసరమైన సవరణలు చేశారు.

  • ట్రాన్స్ జెండర్ ల ఆనందం..

సమాజంలో చాలా వర్గాలు వివక్షకు లోనవుతున్నాయి. అందులో సంచార జాతులతో పాటు ట్రాన్స్ జెండర్లు ప్రధానమైన వారు. ఈ రెండు వర్గాలు ఇప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారు. వీరిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ప్రజా జీవితంలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. పాలనాపరమైన నిర్ణయాధికార ప్రక్రియలు వారికి వేదిక కల్పించడం ద్వారా.. ఆ వర్గం సమస్యలను నేరుగా పరిష్కరించే అవకాశం లభించనుంది.

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ మున్సిపాలిటీల సవరణ బిల్లుకు బిజెపి, సిపిఐ తో పాటు ఇతర విపక్షాల సభ్యులకు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో సభ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నిర్ణయం పై ట్రాన్స్ జెండర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు