Homeజాతీయంత్రిష చుట్టూ తమిళ రాజకీయం!

త్రిష చుట్టూ తమిళ రాజకీయం!

కావేరి జలాల వివాదం పక్కదారి
-ఉదయనిధి డబుల్ మీనింగ్ కామెంట్స్ పై టీవికే ఆగ్రహం
-అరెస్టుకు ప్రయత్నం
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ :-
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నటి త్రిష చుట్టూ తిరుగుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని టి వి కే అధికారంలోకి రాగా.. డీఎంకే కొద్దికాలం పాటు సైలెన్స్ పాటించింది. కానీ ఇటీవల స్వరం పెంచింది. నటి త్రిష ను టార్గెట్ చేసుకొని విమర్శలు చేయడానికి టీవీకే సీరియస్ గా తీసుకుంటోంది. అధికార పార్టీ కావడంతో చర్యలకు ఉపక్రమిస్తుంది. గతంలో త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్టు చేసింది. తాజాగా కావేరి జలాల సమస్యపై తంజావూరులో డీఎంకే నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

తంజావూరు సభలో..
ప్రస్తుతం డీఎంకే పార్టీని నడిపిస్తున్నారు ఉదయనిధి స్టాలిన్. తంజావూరు సభలో ఆయన ప్రసంగిస్తుండగా డీఎంకే కార్యకర్తలు కొందరు ఒక్కసారిగా త్రిష పేరుతో దగ్గరగా నినాదాలు చేశారు. ఆ సమయంలో వారిని వారించాల్సిన ఉదయనిధి డబుల్ మీనింగ్ కామెంట్స్ చేశారు. ఇది వివాదానికి దారితీసింది. మహిళా నటి తో పాటు మహిళా లోకాన్ని అవమానించేలా ఉదయనిధి వ్యవహరించారని మండిపడుతూ టీవీకే నేతలు, కార్యకర్తలు చెన్నైలోని ఉదయనిధి స్టాలిన్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.

స్టాలిన్ ఇంటి ముట్టడి
ప్రస్తుతం తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ అరెస్టుపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. గతంలో ఇవే ఆరోపణలపై ఇద్దరు డిఎంకె ఎమ్మెల్యేల అరెస్టు జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో టీవీకే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. మరోవైపు తంజావూరు పోలీస్ స్టేషన్లో ఉదయనిధి స్టాలిన్ పై కేసు నమోదు అయింది. బిఎన్ఎస్ చట్టంలోని ఆరు తీవ్రమైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఏ క్షణమైనా ఉదయనిధి స్టాలిన్ అరెస్టు ఉంటుంది అనేది తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

అత్యవసర పిటీషన్..
ఒకవైపు టీవీకే పార్టీ శ్రేణుల ఆగ్రహం, అరెస్టుకు సిద్ధపడుతున్న వైనాన్ని గ్రహించారు ఉదయనిధి స్టాలిన్. అరెస్టుల భయం పొంచి ఉండడంతో ఉదయనిధి స్టాలిన్ వెంటనే మద్రాస్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అత్యవసర పిటీషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. మధ్యాహ్నం సెషన్స్ లో విచారిస్తామని చెప్పింది. మొత్తానికైతే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవడం విశేషం.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు