క్రైమ్ మిర్రర్ తెలంగాణ సినిమా బ్యూరో: నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తో చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాత్కాలికంగా NBK111 అనే పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటగా ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తారని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్లో మార్పులు వచ్చే అవకాశముందని తాజా సమాచారం చెబుతోంది.
కొన్ని నివేదికల ప్రకారం, నయనతార స్థానంలో కాజల్ అగర్వాల్ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. షూటింగ్ షెడ్యూల్కు నయనతార డేట్స్ సెట్ కాకపోవడం, అలాగే రెమ్యునరేషన్ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే కాజల్ను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇప్పటికే బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కలిసి ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించారు. ఆ సినిమాలో కాజల్ డాక్టర్ పాత్రలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి నటిస్తే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరగడం ఖాయం.
ఇక కాజల్ అగర్వాల్ ఇటీవల పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కొన్ని పెద్ద సినిమాల్లో ఆమె కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మరోవైపు బాలకృష్ణ కూడా వరుస సినిమాలతో ముందుకు సాగుతున్నారు. ఆయన నటించిన కొన్ని సినిమాలు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు.
ఇదిలా ఉండగా, బాలకృష్ణ మరో కొత్త ప్రాజెక్ట్ను కూడా ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో కలిసి మరో సినిమా చేయబోతున్నారు. దీనికి తాత్కాలికంగా NBK112 అనే పేరు వినిపిస్తోంది.
మొత్తం పైన NBK111 సినిమాలో హీరోయిన్ విషయంలో జరుగుతున్న ఈ మార్పులు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాజల్ నిజంగా ఈ సినిమాలోకి వస్తుందా? లేక నయనతారే కొనసాగుతుందా? అన్నది అధికారిక ప్రకటన వచ్చాకే స్పష్టత రానుంది. అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.