Homeతెలంగాణసర్దార్ నగర్ లో డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఆందోళన..!

సర్దార్ నగర్ లో డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఆందోళన..!

మహేశ్వరం ప్రతినిధి ( క్రైమ్ మిర్రర్): మహేశ్వరం నియోజక వర్గం సర్దార్ నగర్ లో పేదలకోసం ఏర్పాటు చేసిన అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేసి లబ్ధి దారులకు అందేలా చేశారు.కానీ నిబంధనల ప్రకారం ఎక్కడ గాని ఇంటి స్థలం ,భూములు లేకుండా అద్దె ఇంట్లో ఉంటున్నవారు.

 

మీసేవలో దరఖాస్తులు చేసుకోగా కొంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అలెర్ట్ అయ్యాయి.అలా వచ్చినవారికి ఇవ్వకుండా ఓ పార్టీకి చెందిన నాయకులే ఒక్కొక్కరు రెండు,మూడు ఇళ్లను తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు, సర్దార్ నగర్ లో గత 20సంవత్సరాలుగా స్థానికంగా ఉంటు రోజు వారి కూలీ చేసుకొని జీవనం కొనసాగిస్తున్నామని అవేదన వ్యక్తం చేశారు.

సర్దార్ నగర్ లో డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఆందోళన..!
సర్దార్ నగర్ లో డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఆందోళన..!

ప్రభుత్వం నిరుపేదలకోసం ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూం ఇళ్లను బడా బడా నాయకులకు ఎలా ఇస్తారని స్థానిక బాధితులు ఆందోళన చేశారు. ఇప్పటికైనా మరొక సారి సర్వే చేయించి నిజమైన అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని స్థానికుల డిమాండ్.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు