Homeక్రైమ్దారుణం: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తాను కూడా ఉరివేసుకుని..!

దారుణం: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తాను కూడా ఉరివేసుకుని..!

  • దారుణం: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తాను కూడా ఉరివేసుకుని..!

  • ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హనుమకొండలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను తండ్రి రాజశేఖర్ (54) మరియు ఆయన కుమార్తె రాజశ్రీ (24) గా గుర్తించారు.

వారు తమ నివాసంలో సజీవ దహనమయ్యారు. రాజశ్రీ భర్త (అల్లుడు) ప్రవీణ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రవీణ్ వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఘటన అనంతరం ప్రవీణ్ తన పిల్లలతో కలిసి పరారయ్యేందుకు ప్రయత్నించగా, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మరో విషాద ఘటన…
మరోవైపు, ఇలాంటిదే మరో విషాద ఘటన సంగారెడ్డి జిల్లా జులకల్ గ్రామంలోనూ జరిగింది. అక్కడ ఒక తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల భర్తను కోల్పోయిన మమత అనే మహిళ తీవ్ర మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు