పాన్ మసాలా ప్యాకేజింగ్లో ప్లాస్టిక్ వాడకంపై FSSAI నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ను బ్యాన్ చేయడం మంచి విషయమే అయినా, అంతకంటే ప్రమాదకరమైన పాన్ మసాలా సంగతేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఈ పాన్ మసాలా కారణంగా మన దేశంలో ఏటా 10 లక్షల మందికి పైగా నోటి క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం ప్యాకేజింగ్ కవర్లు మార్చితే సరిపోదని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న పాన్ మసాలాను పూర్తిగా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.యువతను ఆకర్షించేలా ఉన్న వీటి ప్రకటనలను నిలిపివేసి, పాన్ మసాలా ఉత్పత్తి, అమ్మకాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోరుతున్నారు.
బాలిక గర్భవతి అంటూ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్ధారణ.. ప్రైవేట్ పరీక్షల్లో ట్విస్ట్
