దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG) పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దాఖలు చేసిన చార్జిషీట్ ద్వారా పలు కీలక, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పేపర్ లీకేజీ వ్యవహారం అత్యంత పకడ్బందీగా, డిజిటల్ ఆధారాలు దొరకకుండా ఏ విధంగా జరిగిందో దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది.
లెక్చరర్ల పాత్రే కీలకం
ప్రశ్నపత్రాల మోడరేషన్ ప్రక్రియలో భాగస్వాములైన లెక్చరర్లే ఈ లీకేజీకి ప్రధాన సూత్రధారులుగా సీబీఐ గుర్తించింది. వీరు ప్రశ్నాపత్రాలను చూసిన వెంటనే అందులోని ప్రశ్నలను కంఠతా పట్టుకోవడం (మెమొరైజ్ చేయడం) ద్వారా ఈ కుంభకోణానికి తెరలేపారు.
గుర్తుంచుకొని, చీట్టీలపై రాసి…
లెక్చరర్లు ప్రశ్నలను గుర్తుంచుకున్న తర్వాత, వాటిని చిన్న చిన్న చీట్టీల (స్లిప్స్) పైన రాసుకున్నారు. అనంతరం ఎన్సీఈఆర్టీ (NCERT) పుస్తకాల్లో ఆ ప్రశ్నలు ఎక్కడున్నాయో, వాటికి సమాధానాలు ఏమిటో గుర్తించారు. ఈ విధంగా ప్రశ్నలు, సమాధానాలను సిద్ధం చేశారు.
డిజిటల్ ఆధారాలు లేకుండా…
ఈ లీకేజీలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎక్కడా కూడా మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు లేదా ఇంటర్నెట్ వంటి డిజిటల్ పరికరాలను ఉపయోగించలేదు. దీనివల్ల ఎలాంటి డిజిటల్ ఆధారాలు దర్యాప్తు సంస్థలకు దొరకకుండా జాగ్రత్తపడ్డారు. కేవలం మెదడులో గుర్తుంచుకోవడం, కాగితంపై రాసి ఇవ్వడం చేశారు.
సన్రైజర్స్ హైదరాబాద్ పూర్తి స్థాయి కెప్టెన్గా ఇషాన్ కిషన్?
