తెలంగాణ

బిగ్ బ్రేకింగ్.. థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..

క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్ :-
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న యాదాద్రి థర్మల్ పవర్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నల్లగొండ జిల్లా దామచర్ల మండల పరిధిలోని వీర్లపాలెం పవర్‌ ప్లాంట్‌లోని ఫస్ట్ ఫ్లోర్‌‌ యూనిట్‌-1లో భారీగా మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం బాయిలర్‌ నుంచి ఆయిల్‌ లీక్‌ కాగా.. అది గమనించని వర్కర్స్ అక్కడే వెల్డింగ్‌ చేస్తుండగా ముందు స్వల్పంగా మంటలు వచ్చాయి. లీక్ అయిల్ వల్ల క్రమంగా ఆ మంటలు యూనిట్‌ మొత్తానికి వ్యాపిస్తుండటంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సిబ్బంది సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఓవైపు పవర్ ప్లాంట్ ట్రయల్‌ రన్‌కు సిద్ధమవుతుండగా ఇలా అకస్మాత్తుగా మంటలు చెలరేగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

హత్నూర లొ ఘోర రోడ్డు ప్రమాదం కారు బైక్ డి అమృత అనే మహిళ (45) మృతి

ఇక నుండి బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button