తెలంగాణ

జైలు నుంచే లగచర్ల సురేష్ డీల్స్.. సీఎం రేవంత్ సీరియస్

లగచెర్ల రైతులు జైలుకు వెళ్లిన ఘటనలో కీలక పరిణామం జరిగింది. లగచర్ల రైతు హీర్యానాయక్‌కు బేడీలు వేసిన ఘటనపై రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ సంజీవరెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ మేరకు రాత్రి జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు హీర్యానాయక్ బేడీల ఘటనపై విచారణ ముగిసింది. దాదాపు 4గంటల పాటు వికారాబాద్, సంగారెడ్డి జిల్లా ఎస్పీలతో కలిసి జైలు సిబ్బందిని ఐజీ సత్యనారాయణ విచారించారు. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతు చేతులకు బేడీలు వచ్చాయన్నారు. జైలు అధికారులు వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదని.. నేరుగా సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారని నిర్ధారించారు. అలాగే హీర్యా నాయక్‌ను కూడా లగచర్ల కేసులో నిందితుడిగా పేర్కొనలేదని… బాలానగర్‌లోని ఓ కేసులో నిందితుడిగా పేర్కొన్నట్లు గుర్తించారు. ఉద్దేశ పూర్వకంగా చేశారా? లేక పొరపాటున చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేశారు.

ఏ2 సురేష్ జైల్లో నుంచి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడారు. హీర్యా నాయక్‌కు గుండెనొప్పి అని చెబితే బెయిల్ వస్తుందని సురేష్ చెప్పారు. అసలు సురేష్ ఫోన్‌లో మాట్లాడింది ఎవరితో అనే దానిపై ఆరా తీస్తున్నట్లు ఐజీ వెళ్లడించారు. ఈ కేసులో నిర్లక్ష్యం చేసిన అందరికీ కఠిన చర్యలు తప్పవని ఐజీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Spread the love
Back to top button