కడప జిల్లాలో కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. వల్లూరు ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థి సాయిని లక్ష్యంగా చేసుకుని నలుగురు వ్యక్తులు అపహరణకు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం మేరకు, దుండగులు విద్యార్థిని బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారు. ఈ ఘటన గమనించిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసును అత్యవసరంగా పరిగణించిన పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి అనుమానితుల వాహనాన్ని వెంబడించారు.
పోలీసులు దగ్గరపడుతున్నారని గుర్తించిన కిడ్నాపర్లు భయంతో విద్యార్థిని మధ్యలోనే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. అదృష్టవశాత్తూ సాయి సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
also read: పెళ్లి రోజే షాకింగ్ ఘటన.. భార్యను ‘బేరం’ పెట్టిన యువకుడు!
