ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అత్యవసర వైద్య సేవలను మినహాయించి మిగిలిన విధులను బహిష్కరించారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు స్టైఫండ్ పెంచాలని వారు కోరుతున్నారు.
తమకు అందుతున్న స్టైఫండ్ తెలంగాణలోని జూనియర్ డాక్టర్లతో పోలిస్తే తక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్టైఫండ్ను పెంచాలని, ఆస్పత్రుల్లో అవసరమైన సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)లో జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. సూపరింటెండెంట్ కార్యాలయం వద్దకు చేరుకుని తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
స్టైఫండ్ పెంపుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిరసన కొనసాగిస్తామని తెలిపారు.
జూనియర్ డాక్టర్ల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. వైద్యుల డిమాండ్లపై అధికారుల స్పందన కోసం వారు ఎదురుచూస్తున్నారు.
also read: IPL క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్.. “లైంగికదాడికి పాల్పడ్డాడంటూ” యువతి ఫిర్యాదు
