Homeతెలంగాణపోలింగ్‌కేంద్రాల  ప‌రిశీల‌న‌

పోలింగ్‌కేంద్రాల  ప‌రిశీల‌న‌

  • భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష
  • జిల్లా ఎస్పీ డి.జానకి

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, క్రైమ్ మిర్ర‌ర్ః

మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా మ‌హాబూబ్ న‌గ‌ర్ జిల్లా ఎస్‌పీ డి.జాన‌కి పోలింగ్ కేంద్రాల‌ను సంద‌ర్శించారు.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌రిధిలోని టీచ‌ర్స్ కాల‌నీలోని బ్రిలియంట్ స్కూల్‌, ఠాగూర్ స్కూల్‌, గాంధీ రోడ్ స్కూల్ పోలింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించారు.

ఈసంద‌ర్భంగా పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఏర్పాటు చేసిన భ‌ద్ర‌త‌, సిబ్బంది, సీసీ కెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ‌, క్యూలైన్ నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్షించారు.

ఈసంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ ఎక్క‌డ‌కూడ అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లుజ‌రుగ‌కుండా అప్ర‌మ‌త్తంగా విధులు నిర్వ‌హించాల‌ని అధికారుల‌కు, సిబ్బందికి సూచించారు.

ప్ర‌శాంత వాతావ‌ర‌ణ‌లో ఎన్నిక‌లు కొన‌సాగుతున్నాయి…
జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు. సీఐలు, డీఎస్పీల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు విధులు నిర్వర్తిస్తూ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాయని పేర్కొన్నారు.

అదనంగా రూట్ మొబైల్ బృందాలు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ శాంతి భద్రతలను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నాయని వివరించారు.

ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు