Homeఆంధ్ర ప్రదేశ్ఇక నుండి ప్రభుత్వ బడుల్లో కూడా (LKG, UKG)..!

ఇక నుండి ప్రభుత్వ బడుల్లో కూడా (LKG, UKG)..!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో: ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా చిన్నారులకు చిన్న వయస్సు నుంచే ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన పునాది విద్యను aఅందించాలనే లక్ష్యం తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం (2025-26) నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో UKG (యూకేజీ) తరగతులను ప్రారంభించాలని కీలక నిర్ణయం తీసుకుంది.

అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానం చేస్తూ, ప్రీ-ప్రైమరీ (LKG, UKG) స్థాయి నుంచే పిల్లలను ప్రభుత్వ విద్య వైపు ఆకర్షించడం చెయ్యాలని భావిస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో చేరకముందే పిల్లలకు అక్షర జ్ఞానం మరియు క్రమశిక్షణను అలవాటు చేయడం దీని ఉద్దేశం. దీనివల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు (Enrollments) కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు