HomeతెలంగాణTelangana: హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన...!

Telangana: హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ హైకోర్టు జోన్-II (Zone-II) నూతన భవన సముదాయ నిర్మాణానికి ఆదివారం రోజున శంకుస్థాపన జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బుద్వెల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. రాజేంద్రనగర్‌లోని బుద్వెల్‌లో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ నూతన హైకోర్టు సముదాయాన్ని నిర్మిస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు. ఈ జోన్ సుమారు 60 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇందులో న్యాయమూర్తుల నివాస విల్లాలు (సుమారు 60), సెంట్రల్ రికార్డ్ రూమ్ మరియు ఇతర అనుబంధ భవనాలు ఉంటాయి.

ఈ నిర్మాణ పనులను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మొత్తం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సుమారు ₹2,583 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. గతంలో, మార్చి 27, 2024న జోన్-I భవనాల (ప్రధాన కోర్టు భవనం మరియు కార్యాలయాలు) నిర్మాణానికి శంకుస్థాపన జరిగి, ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు