Homeతెలంగాణశాసనమండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మూకుమ్మడి సస్పెన్షన్!

శాసనమండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మూకుమ్మడి సస్పెన్షన్!

తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శాసనమండలిలో జరిగిన ఘటనలు రాష్ట్ర చరిత్రలో అరుదైన పరిణామంగా మారాయి. బీఆర్ఎస్ సభ్యులను ఒకరోజు పాటు శాసనమండలి నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ అమలులోకి రావడం గమనార్హం. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మార్షల్స్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై మండలి ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన సభ్యుల్లో మధుసూదనాచారి, రవీందర్‌రావు, దేశపతి శ్రీనివాస్‌, ఎల్‌. రమణ, యాదవరెడ్డి, సుంకరి రాజు, నవీన్‌కుమార్‌రెడ్డి, మధుసూదన్‌, వాణీదేవి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎం.కోటిరెడ్డి ఉన్నారు.

ఇక మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి కుటుంబానికి సంబంధించిన స్కామ్ బయటపడే వరకు ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి వాటా ఉన్నందువల్లే చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందా అని ప్రశ్నించారు. ఆదివారం గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ అక్రమ మైనింగ్ వ్యవహారంపై సభా సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మైనింగ్ చేస్తున్న కంపెనీలో మంత్రికి సంబంధం ఉందని ఆరోపిస్తూ విచారణ పారదర్శకంగా జరగాలని కోరారు. విచారణ నిష్పక్షపాతంగా సాగాలంటే సంబంధిత మంత్రి వెంటనే రాజీనామా చేయాలని స్పష్టం చేశారు.

అక్రమం జరిగిందని ముఖ్యమంత్రి స్వయంగా ఒప్పుకున్నారని, రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ పొంగులేటి దూరపు బంధువులదని ప్రభుత్వం చెబుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. 2020 నుంచి 2022 వరకు ఆ సంస్థలో పొంగులేటి ఛైర్మన్‌గా వ్యవహరించారని తెలిపారు. అలాగే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా అదే కంపెనీకి అప్పగించారని ఆరోపించారు. గత రెండున్నర ఏళ్లుగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మంత్రిపై ఇంతటి ఆరోపణలు ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తూ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో దాడి కొనసాగించారు.

ALSO READ: Mercedes-Benz V-Class: గర్ల్ ఫ్రెండ్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు