Homeక్రైమ్Emotional Incident: ‘అమ్మా నాన్న.. ఐ లవ్ యూ.. నన్ను క్షమించండి’

Emotional Incident: ‘అమ్మా నాన్న.. ఐ లవ్ యూ.. నన్ను క్షమించండి’

Emotional Incident: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా గంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయాన్ని కలచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. పుట్టుకతోనే దివ్యాంగురాలిగా ఉన్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడి తన జీవితానికి ముగింపు పలికింది. తన చేతిపై ‘అమ్మా నాన్న.. ఐ లవ్ యూ.. నన్ను క్షమించండి’ అంటూ రాసుకుని ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధ్రువ్ నగర్‌కు చెందిన దీక్షా త్రిభువన్ (21) పుట్టుకతోనే దివ్యాంగురాలు. మాట్లాడటంలో కూడా ఆమెకు ఇబ్బందులు ఉండేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం సుమారు 6 గంటల 30 నిమిషాల సమయంలో ఇంట్లో ఎవరూ లేని వేళ ఫ్యాన్‌కు ఉరివేసుకుని దీక్షా ఆత్మహత్య చేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించగా ఆమె చేతిపై రాసుకున్న చివరి మాటలు పోలీసులకే కాదు.. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పించాయి. అమ్మా నాన్న నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను క్షమించండి అంటూ ఆమె రాసుకున్న వాక్యాలు కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టాయి.

తమ కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీక్ష ఎప్పుడూ ధైర్యంగా ఉండేదని, అందరితో స్నేహంగా మెలిగేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెనే తమ భవిష్యత్తుగా భావించామని, ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అసలు ఊహించలేదని కన్నీటితో చెబుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం దివ్యాంగురాలిగా ఉండటం వల్లే దీక్ష మానసిక ఒత్తిడికి లోనై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆమె ఆత్మహత్యకు గల అసలు కారణాలపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు.

ALSO READ: Madaram: సమ్మక్క- సారలమ్మ గద్దెల వద్ద జాగ్రత్త.. తలలు పగులుతున్నాయి

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు