HomeతెలంగాణTelangana: ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత...!

Telangana: ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 1 నుండి మే 31 వరకు ఈ బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. ఒకే చోట కనీసం మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీలకు అర్హులు. ఒకే స్టేషన్‌లో ఆరేళ్లు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది.

ఈ బదిలీలు పారదర్శకమైన కౌన్సెలింగ్ పద్ధతిలో నిర్వహించబడతాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ఎన్నికల విధులతో సంబంధం లేని శాఖలకు మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తించే అవకాశం ఉంది. ఈ బదిలీలకు సంబంధించి మరింత స్పష్టమైన అధికారిక జీవో (GO) త్వరలోనే విడుదల కానుంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు