Homeఆంధ్ర ప్రదేశ్ఆటో, టిప్ప‌ర్ ఢీ

ఆటో, టిప్ప‌ర్ ఢీ

  • ఒక‌రు మృతి, మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మం

  • ప‌ది మందికి తీవ్ర‌గాయాలు

కాకినాడ, క్రైం మిర్ర‌ర్ః

కత్తిపూడిలో బుధ‌వారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో లారీని ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో ఒకరు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ప‌ది మందికి తీవ్ర గాయాల‌య్యాయి.

స్థానికులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని శ్రీరాంపురం నుంచి ప్రత్తిపాడు మండలం ధర్మవరంకు 15 మంది కూలీల‌తో చెట్లు నరికేందుకు ఆటోలో వెళ్తున్నారు.

ఈ క్ర‌మంలో కత్తిపూడిలో పిఠాపురం నుంచి రౌతులపూడి వెళుతున్న టిప్పర్ లారీని ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాద ఘ‌ట‌న‌లో శ్రీరాంపురం గ్రామానికి చెందిన పితాని కామరాజు (65) మృతి చెంద‌గా గాయ‌పడిన వారిని ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించిన‌ట్లు తెలిపారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు