క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారులు వర్ష సూచన చేశారు. రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తాజాగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ ప్రకటన విడుదల చేశారు. ఈ అల్పపీడనం కారణంగా కోస్తాంధ్ర మరియు రాయలసీమలో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ అల్పపీడనం దాటికి కోస్తాంధ్రలో గురువారం వరకు మరోవైపు రాయలసీమలో రేపటి సాయంత్రం వరకు కూడా వర్షాలు పడతాయని తెలిపారు. కాగా ఇవాళ జిల్లాలలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
నేడు వర్ష సూచన జిల్లాలు :-
1. మన్యం
2. అల్లూరి
3. పోలవరం
4. అనకాపల్లి
5. కోనసీమ
6. తూర్పుగోదావరి
7. పశ్చిమగోదావరి
8. ఏలూరు
9. కృష్ణ
10. గుంటూరు
11. ఎన్టీఆర్
12. బాపట్ల
13. చిత్తూరు
14. తిరుపతి
కాగా ఈ రెండు రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులు వినిపించిన వెంటనే రైతులు మరియు పశుకాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి అని సూచించారు.