Homeఆంధ్ర ప్రదేశ్అమరావతి ఉద్రిక్తం!

అమరావతి ఉద్రిక్తం!

  • సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ పేరుతో వైసీపీ నేతల

  • పర్యటన అడ్డుకున్న రైతులు

  • కోడిగుడ్ల తో దాడులు

  • రణరంగంగా ఉండవల్లి సెంటర్

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి షాక్ తగిలింది. అమరావతి ప్రాంతంలో పర్యటనకు వెళ్లిన ఆ పార్టీ నేతలకు రైతుల తీవ్ర నిరసన సెగ తగిలింది. వారి పర్యటనను అడ్డుకున్న అమరావతి రైతులు కోడిగుడ్లతో దాడి చేశారు.

రాళ్లు రావడంతో వైసీపీ నేతలు ప్రయాణిస్తున్న వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. అయితే ఎన్ని రోజులు అమరావతి రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన వైసిపి నేతలు.. ఇప్పుడు అదే అమరావతికి భూముల సమీకరించడాన్ని వ్యతిరేకిస్తూ.. సి ఆర్ డి ఏ భూముల పరిరక్షణ పేరుతో పరిశీలనకు వెళ్లారు. అది ఉద్రిక్తంగా మారింది.

  • చురుగ్గా పనులు..

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఎక్కడ పనులు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సిఆర్డిఏ భూముల పరిరక్షణ పేరుతో అమరావతి రైతులపై ప్రేమ కనబరిచారు.

అమరావతి ప్రాంతంలో పర్యటించి భూ సమీకరణకు అడ్డు చెప్పే ప్రయత్నం చేశారు. వైసీపీకి చెందిన పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు తదితర నేతలు శనివారం ఉండవల్లి సెంటర్ వద్దకు చేరుకున్నారు. సి ఆర్ టి ఏ పరిరక్షణ అంటూ అమరావతి భూములను పరిశీలనకు అక్కడకు చేరుకున్నారు. స్థానిక అమరావతి రైతులు, టిడిపి సానుభూతిపరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గో బ్యాక్ వైసీపీ అంటూ నల్ల బ్యాడ్జీలతో వైసీపీ నేతల పర్యటనను రైతులు క్షేత్రస్థాయిలో అడ్డుకున్నారు. వైసిపి హయాంలో అమరావతిని నాశనం చేయడానికి ప్రయత్నం చేసి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఎక్కడికి వచ్చారు అంటూ నిలదీశారు.

కొందరు రైతులు ఆగ్రహంతో కోడిగుడ్లను విసిరారు. నిరసన తీవ్ర రూపం దాల్చడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగి ఉండవల్లి సెంటర్ రణరంగంగా మారింది.

  • వాహనాలపై దాడి..

మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రయాణిస్తున్న కారుపై నిరసనకారులు రాళ్లురవడంతో ఆయన వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అలాగే సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ బృందంలోని కొందరు, గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులపై రాళ్లు రువ్వినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ దాడిలో విధుల్లో ఉన్న పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని వ్యతిరేకించి.. ఇప్పుడు అదే అమరావతి రైతుల పేరుతో పరామర్శించేందుకు రావడం ఏంటని వైసీపీ నేతలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే నిరసనను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న ఓ ఉన్నత పోలీసు అధికారిని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏకంగా బూతులు తిడుతూ.. రౌడీ తరహాలో వెనక్కి నెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంబటి రాంబాబు ఇటీవల కాలంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే వర్షాలు లేక అమరావతి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రాథమిక దశ దాటేస్తుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోందని.. అందుకే ఇటువంటి పరామర్శల పేరుతో కుట్రలకు తెర లేపారని అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు