Homeసినిమాఅల్లు అర్జున్ మానవత్వం: అనాథ బాలికకు అండగా ప్రతినెలా..!

అల్లు అర్జున్ మానవత్వం: అనాథ బాలికకు అండగా ప్రతినెలా..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: అల్లు అర్జున్ కేవలం వెండితెర పైనే కాకుండా, నిజ జీవితంలో కూడా తన సేవా గుణంతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన దుర్గ అనే మానసిక దివ్యాంగురాలి బాధ్యతను స్వీకరించారు.

ఆమె పోషణ కోసం నెలకు రూ. 7,500 ఆర్థిక సాయం అందజేస్తున్నారు. అలాగే తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా నిలిచారు. ఆమె వైద్యం, నిత్యావసర ఖర్చుల కోసం ప్రతి నెలా రూ. 10,000 అందేలా శాశ్వత ఏర్పాట్లు చేశారు.

 ‘పుష్ప-2’ ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన మహిళ కుటుంబానికి రూ. 2 కోట్లు (అల్లు అర్జున్ రూ. 1 కోటి, చిత్ర యూనిట్ మరో కోటి) ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే గాయపడిన బాలుడి వైద్య ఖర్చులు మరియు భవిష్యత్తు కోసం నిధిని ఏర్పాటు చేశారు.

తన కుటుంబ వేడుకలకు అభిమానులను ఆహ్వానించడం, ఆపదలో ఉన్న అభిమానుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం ఆయన ప్రత్యేకత. అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా ఏటా ఒక మంచి పని చేయాలని అభిమానులకు పిలుపునిస్తూ, సేవా కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేస్తున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు