కృష్ణ, క్రైమ్మిర్రర్: ఏపీలో లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందాడు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెద్దతుమ్మడి వద్ద అతివేగంతో వచ్చిన లారీ అదుపుతప్పి బైకును ఢీకొంది. అనంతరం బైకును ఈడ్చుకుంటూ మురుగు కాలువలోకి దూసుకెళ్లింది.
దీంతో శివయ్య ( 27 ), అమలేశ్వరావు ( 27) అనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.