Homeక్రైమ్ఘోర రోడ్డు ప్రమాదం.. భర్త కళ్లముందే భార్య మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. భర్త కళ్లముందే భార్య మృతి

క్రైమ్ మిర్రర్ : ఆంధ్రప్రదేశ్‌లో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న మహిళ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. భర్త చూస్తుండగానే ఆమె మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలవరం జిల్లాకు చెందిన కొల్లు పూజ తన భర్తతో కలిసి బైక్‌పై రాజోలు నుంచి సోంపల్లి వైపు వెళ్తోంది. మార్గమధ్యంలో వారి ద్విచక్రవాహనాన్ని మరో బైక్ ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదం ధాటికి పూజ బైక్‌పై నుంచి కిందపడిపోయింది.

కిందపడే సమయంలో ఆమె తలకు రోడ్డుకు బలంగా తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో వైద్యులు చికిత్స అందించేలోపే పూజ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. భార్యను కళ్లముందే కోల్పోవడంతో భర్త తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఘటనపై భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
also read : వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు