కుటుంబ సభ్యులందరూ ఒకే సబ్బును వాడే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకే సబ్బును ఇంట్లోని వారందరూ ఉపయోగించడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు, ప్రత్యేకించి చర్మ వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు.సూక్ష్మజీవుల వ్యాప్తి:స్నానం చేసిన తర్వాత సబ్బు ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఇలాంటి తేమ ఉన్న వాతావరణంలో బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెందుతాయి. ఆ సబ్బును కుటుంబంలోని మరొకరు వాడినప్పుడు, ఆ సూక్ష్మజీవులు సులభంగా వేరొకరి శరీరానికి వ్యాపిస్తాయి. దీనివల్ల గజ్జి, తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి వేగంగా విస్తరిస్తాయి.
జాగ్రత్తలు పాటించాలి:- ఇంట్లో ఎవరికైనా ఇప్పటికే చర్మ సమస్యలు ఉంటే, వారి ద్వారా మిగిలిన వారికి ఈ వ్యాధులు సోకే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ వ్యక్తిగతంగా వేర్వేరు సబ్బులను ఉపయోగించాలని లేదా లిక్విడ్ బాడీ వాష్ వాడాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం.
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం…! ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’…
