Homeక్రైమ్రోకలిబండతో మోది తల్లిని హత్య చేసిన కొడుకు– ఉత్తరప్రదేశ్‌లో సంచలనం

రోకలిబండతో మోది తల్లిని హత్య చేసిన కొడుకు– ఉత్తరప్రదేశ్‌లో సంచలనం

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫరూఖాబాద్ జిల్లాలో ఓ యువకుడు తన సొంత తల్లిపై దాడి చేసి హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

స్థానికుల వివరాల ప్రకారం, కుటుంబంలో జరిగిన గొడవ తీవ్రరూపం దాల్చడంతో యువకుడు ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న రోకలితో తల్లిపై దాడి చేశాడు. ఆమెను కాపాడేందుకు మధ్యలోకి వచ్చిన సోదరి కూడా ప్రమాదంలో పడింది. ఆమెపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించగా, ఆమె తెలివిగా మరో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని తప్పించుకుంది.

ఇంటి వద్ద నుంచి వినిపించిన కేకలతో అప్రమత్తమైన పొరుగువారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన వారు యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు కారణమైన పరిస్థితులపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

also read: వందేమాతరం గేయానికి గౌరవం తప్పనిసరి.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు