రేషన్ కార్డ్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) పరిధిలో వచ్చే నెలల కోసం కేటాయించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది.
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ముందుగానే అందించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభమై, నెలాఖరులోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం చౌక ధరల దుకాణాలకు బియ్యం సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నిర్ణయంతో లబ్ధిదారులు ఒకేసారి మూడు నెలల ధాన్యాన్ని పొందే అవకాశం ఉంది. దీని వల్ల వరుసగా రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు, ప్రజలకు సౌకర్యం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
అలాగే సరఫరా వ్యవస్థను సులభతరం చేయడం, నిల్వలను సమర్థంగా వినియోగించడం కూడా ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
also read: పంజాబ్ పేపర్ లీక్ వివాదం: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద బీజేపీ నిరసన
