హిమాచల్ ప్రదేశ్లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఆలయంలో దొంగతనం చేసినట్లు అనుమానిస్తూ ఇద్దరు మహిళలను ప్రజల ముందే అవమానకరంగా కొట్టిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
సమాచారం ప్రకారం, నాగ్ని మాతా ఆలయంలో ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా అక్కడి స్థానికులు వారిని పట్టుకున్నారు. ఆలయంలోని వస్తువులు దొంగిలించారని ఆరోపిస్తూ కొందరు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మహిళలను చెప్పులతో కొట్టడం జరిగింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహిళలపై ఇలా హింసకు దిగడం పట్ల నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం తప్పని పేర్కొంటుండగా, మరికొందరు బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. మహిళలను పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
also read: తిరువూరులో విషాదం: విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న కారు- వ్యక్తి మృతి
