క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ‘ఇందిరమ్మ బీమా’ పథకాన్ని నవంబర్ 19వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆ రోజున ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఉచిత బీమా:దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా, తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాను వర్తింపజేయనున్నట్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.1.15 కోట్ల కుటుంబాలకు లబ్ధి:ఈ ‘ఇందిరమ్మ బీమా’ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అనారోగ్య సమస్యల బారిన పడినప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల వైద్యం అందక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.
Bhagyashree Borse: భాగ్యశ్రీ సక్సెస్ జోస్.. మనసులో కోరిక బయటపెట్టేసిందిగా!
Supreme Court: ప్రేమగా దగ్గరైతే పోక్సో కేసా? సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!